భారతదేశం, ఆగస్టు 12 -- నయా యుగ ఈ-కామర్స్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్ 'షిప్‌రాకెట్' (Shiprocket) ప్రాథమిక పబ్లిక్ ఆఫరింగ్ (IPO) నేడు (ఆగస్టు 12, 2026) ప్రారంభమైంది. ఇన్వెస్టర్లు ఆగస్టు 14 వరకు ఈ ఐపీఓకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంపెనీ తన షేరు ప్రైస్ బ్యాండ్‌ను రూ. 92 నుంచి రూ. 97గా నిర్ణయించింది.

గ్రే మార్కెట్‌లో షిప్‌రాకెట్ షేర్లకు మంచి ఆదరణ కనిపిస్తోంది. ప్రస్తుతం షిప్‌రాకెట్ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) రూ. +30 వద్ద కొనసాగుతోంది. గరిష్ఠ ఆఫర్ ధర రూ. 97తో పోలిస్తే, గ్రే మార్కెట్ ట్రెండ్ ఆధారంగా ఈ షేరు రూ. 127 వద్ద లిస్ట్ అయ్యే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. ఇది దాదాపు 30.93 శాతం లిస్టింగ్ లాభాన్ని సూచిస్తోంది. గత ఏడు ట్రేడింగ్ సెషన్లలో జీఎంపీ రూ. 14 నుంచి రూ. 30 మధ్య క్రమంగా పుంజుకుంది.

ఈ ఐపీఓ ద్వారా షిప్ రాకెట్ కంపెనీ మొత్తం రూ. 1,617.48 కోట...