భారతదేశం, మార్చి 14 -- ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణపైనా పడుతున్నాయి. ఇప్పటికే గ్యాస్ సంక్షోభంతో కొన్ని హోటళ్లు మూతపడ్డాయి. హాస్టళ్లలో కూడా ప్రభావం పడింది. గృహ అవసరాలకు ఉపయోగించే డొమెస్టిక్ సిలిండర్ల కొరత కూడా సృష్టిస్తున్నారు.

రాష్ట్రంలోని ఆలయాల మీద కూడా ఎల్పీజీ సంక్షోభం ప్రభావం ఉంది. శ్రీశైలం దేవస్థానం భక్తులకు అన్నప్రసాదం నిరంతరాయంగా తయారు చేసేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. వాణిజ్య సిలిండర్లకు బదులుగా గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్లను తాత్కాలికంగా ఉపయోగించడానికి ఆలయ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రత్యేక అనుమతి పొందారు. ఉగాది మహోత్సవాల సమయంలో అన్నప్రసాదాలకు అంతరాయం కలగకుండా ఉండటానికి ఈ ముందు జాగ్రత్త చర్య ...