భారతదేశం, ఆగస్టు 25 -- ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో అత్యంత విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు లాడ్జి గదిలో అనుమానాస్పద స్థితిలో శవాలై కనిపించారు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, నిరంతరం వేధిస్తున్న ఆర్థిక ఇబ్బందులే ఈ దారుణమైన నిర్ణయానికి కారణమై ఉండవచ్చని పోలీసులు ప్రాథమిక విచారణలో అనుమానిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామానికి చెందిన పల్లపు సుధాకర్ (36) అనే వ్యక్తి తన ముగ్గురు సోదరీమణులు, 15 ఏళ్ల మేనల్లుడితో కలిసి జూలై 28న శ్రీశైలం చేరుకున్నాడు. వీరంతా సుధాకర్‌కు చెందిన ఆటోలోనే వచ్చి.. ఓ ప్రైవేట్ సత్రంలోని గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు.

మంగళవారం రోజున సత్రం సిబ్బంది గది తలుపులు ఎంతకీ తెరుచుకోకపోవడం, లోపలి నుంచి దుర్వాసన వస్తుండటాన్ని గమనించారు. అనుమానం వచ...