భారతదేశం, జూన్ 30 -- భక్తులకు 45 నిమిషాలలోపు శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం లభించేలా చూసేందుకు, శ్రీశైలం ఆలయ యంత్రాంగం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఆధారిత దర్శన నిర్వహణ వ్యవస్థను ప్రవేశపెట్టనుంది. వరల్డ్ క్లాస్ క్యూ-లైన్ల సముదాయాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది.

ఈ ప్రాజెక్టులో ప్రధాన ఆకర్షణ, తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) వ్యవస్థను పోలిన అత్యాధునిక క్యూ కాంప్లెక్స్. ఇది జనసమూహ నిర్వహణలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి, యాత్రా అనుభవాన్ని మెరుగుపరుస్తుందని ఆలయ అధికారులు భావిస్తున్నారు. ఈ సదుపాయంలో ఆధునిక సౌకర్యాలు, క్రమబద్ధమైన ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు, అధునాతన నిఘా, వేయింటింగ్ హాళ్లు, యాత్రికుల కదలికలను నియంత్రించడానికి ఏఐ ఆధారిత పర్యవేక్షణ వంటివి ఉంటాయి.

రూ. 145 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ కాంప్లెక్స్ కోసం ప్రాథమి...