భారతదేశం, ఫిబ్రవరి 21 -- ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్ ఎట్టకేలకు జైలు నుంచి నిన్న (ఫిబ్రవరి 20) బయటకు వచ్చారు. రూ. 30 కోట్ల ఆర్థిక మోసం కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శుక్రవారం ఆయన ఉదయ్‌పూర్ సెంట్రల్ జైలు నుండి విడుదలయ్యారు. గతేడాది డిసెంబర్‌లో రాజస్థాన్ పోలీసులు ముంబైలో ఆయనను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

జైలు వెలుపల వేచి ఉన్న మీడియాతో విక్రమ్ భట్ సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కొంత తాత్విక ధోరణిలో డైరెక్టర్ స్పందించారు.

"గత రెండున్నర నెలలుగా నేను జైలు జీవితం గడిపాను. నిజం ఎప్పటికైనా బయటకు వస్తుందని నాకు మొదటి నుంచీ నమ్మకం ఉంది. జైలులో నాకు ఒక స్నేహితుడు పరిచయమయ్యాడు. మేవార్ మట్టిలో నిజం కొంతకాలం ఇబ్బందులు పడవచ్చు కానీ, అది ఎప్పటికీ ఓడిపోదు అని అతను నాకు చెప్పాడు. అదే మేవార్ మట్టిని తిలకంగా దిద్దుకుని ఇక్కడి...