భారతదేశం, జూన్ 14 -- ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కృష్ణా నదిలో ప్రయాణిస్తున్న ఒక నాటు పడవ అకస్మాత్తుగా బోల్తా పడిన ఘటనలో నలుగురు గల్లంతయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన బంధువులు ప్రయాణిస్తున్న పడవ మునిగిపోవడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. పండుగ లాంటి వాతావరణం ఉండాల్సిన ఆ ఇంట ఒక్కసారిగా శోకసంద్రం అలుముకుంది.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒకే కుటుంబానికి చెందిన 10 మంది బంధువులు పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కోనూరు గ్రామ పరిధిలో జరిగే ఒక శుభకార్యానికి హాజరయ్యారు. వేడుక ముగిసిన అనంతరం వారంతా కలిసి కృష్ణా నది గుండా అవతలి ఒడ్డుకు వెళ్లేందుకు ఒక చిన్న నాటు పడవపై తిరుగు ప్రయాణమయ్యారు. అయితే ప్రయాణం మధ్యలో నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం, సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఉండటంతో పడవ ఒక్క...