భారతదేశం, ఆగస్టు 7 -- హిందూ ధర్మశాస్త్రాలు, శివపురాణం ప్రకారం పరమ శివుడికి మూడు కన్నులు ఉంటాయి. ఈ మూడో కన్నును 'త్రినేత్రం' లేదా 'జ్ఞాన చక్షువు' అని పిలుస్తారు. శివుడి కుడి కంటిలో సూర్యుడు, ఎడమ కంటిలో చంద్రుడు కొలువై ఉంటారని నమ్ముతారు. అయితే సృష్టిలో ఎప్పుడైతే అధర్మం పెరిగిపోతుందో, అప్పుడే ఈ మూడో కన్ను తెరచుకుంటుందని పురాణాలు చెబుతున్నాయి. మరి లయకారకుడైన ఆ భోళా శంకరుడికి మూడో కన్ను ఎలా వచ్చింది? దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన పౌరాణిక గాథలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

పౌరాణిక కథల ప్రకారం, ఒకసారి సరదాగా పార్వతీ దేవి వెనుక వైపు నుంచి వచ్చి తన చేతులతో పరమ శివుడి రెండు కళ్ళను మూసింది. మహాదేవుడి కళ్ళు మూతపడగానే క్షణంలో సమస్త సృష్టి గాఢాంధకారంలోకి జారిపోయింది. ఆ చీకటిని చూసి విశ్వం మొత్తం ఒక్కసారిగా హహాకారాలు మిగిలాయి. భూమిపై ఉన్న మనుషులు,...