భారతదేశం, ఏప్రిల్ 8 -- జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఆయన ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారడానికి దాదాపు రెండున్నర ఏళ్ల సమయం పడుతుంది. ఈ క్రమంలోనే 2027లో శని మేషరాశిలోకి అడుగుపెట్టబోతున్నారు. శని చేసే ఈ మార్పు వల్ల కొన్ని రాశుల వారికి కష్టాలు తీరి అదృష్టం వరిస్తే.. మరికొన్ని రాశుల వారు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏల్నాటి శని, అర్థాష్టమ శని ప్రభావాల్లో మార్పులు రానున్నాయి.

క్రమశిక్షణతో ఉండి, కష్టపడి పనిచేసే వారిపై శని దేవుడు ఎప్పుడూ కరుణ చూపిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. శని అనుగ్రహం ఉంటే సామాన్యులు కూడా కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంటుంది.

జాతక చక్రంలో తొమ్మిది నుంచి పదకొండో స్థానాల మధ్య శని, మంగళ గ్రహాలు కలిసి ఉంటే ఆస్తిపాస్తుల విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. దీనివల్ల కుటుంబంలో కలహాలు వచ...