భారతదేశం, ఏప్రిల్ 24 -- నవగ్రహాలలో అత్యంత శక్తివంతుడు, న్యాయాధికారి అయిన శని దేవుడు తన గమనాన్ని మార్చినా లేదా అస్తమించి ఉదయించినా దాని ప్రభావం ద్వాదశ రాశులపై బలంగా ఉంటుంది. తాజాగా శని దేవుడు మీన రాశిలో ఉదయించాడు. జ్యోతిష్య గణాంకాల ప్రకారం.. శని దేవుడు 2027 మార్చి 26 వరకు ఇదే స్థితిలో సంచరించనున్నాడు. దాదాపు రెండేళ్ల పాటు కొనసాగే ఈ సమయం కొన్ని రాశుల వారికి అద్భుతమైన రాజయోగాన్ని ప్రసాదించబోతోంది.

ముఖ్యంగా ఈ మార్పు వల్ల కొన్ని రాశుల వారు "బంగారు పాదాల" మీద వున్నారు. అంటే, శని దేవుడు ఈ రాశుల వారికి అత్యంత అనుకూలమైన, స్థిరమైన ఫలితాలను అందిస్తాడని అర్థం. ఆ అదృష్ట రాశులు ఏవి? ఎవరికి ఏ లాభాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం.

వృషభ రాశి వారికి ఈ కాలం ఒక వరం లాంటిదని చెప్పవచ్చు. గత కొంతకాలంగా వేధిస్తున్న సమస్యల నుండి వీరికి ఉపశమనం లభిస్తుంది. దీర్ఘకాలిక...