భారతదేశం, ఆగస్టు 18 -- ముంబై: నిరంతర నష్టాలతో సతమతమవుతున్న వొడాఫోన్ ఐడియా (వీఐ) షేర్ ధర సోమవారం, ఆగస్టు 18న అనూహ్యంగా పుంజుకుంది. ఇంట్రాడే లావాదేవీల్లో ఏకంగా 4% పెరిగి ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చింది. ఆర్థిక సంవత్సరం 2025-26 మొదటి త్రైమాసికం (Q1 FY26)లో కంపెనీ నష్టాలు తగ్గడమే ఈ పెరుగుదలకు ప్రధాన కారణం. బలమైన భారతీయ స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ కూడా దీనికి తోడైంది.
సోమవారం, వొడాఫోన్ ఐడియా షేర్ ధర రూ. 6.28 వద్ద ప్రారంభమైంది. ఇది గత ముగింపు ధర కంటే 2% అధికం. ఒక దశలో ఈ షేర్ ధర రూ. 6.40 గరిష్ఠ స్థాయిని తాకింది. ఇది గత ముగింపు ధరతో పోలిస్తే 4.06% పెరుగుదల.
నిజానికి, వొడాఫోన్ ఐడియా తన జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను మార్కెట్ ముగిసిన తర్వాత ఆగస్టు 14, గురువారం నాడు ప్రకటించింది. ఈ ఫలితాల్లో కంపెనీ నికర నష్టం రూ. 6,608 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.