భారతదేశం, మే 27 -- ఆంధ్రప్రదేశ్ వేదికగా ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి పెద్ద పీట వేసేందుకు ఒక భారీ సదస్సు సిద్ధమవుతోంది. వచ్చే జూలై 9, 10 తేదీల్లో విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌లో 'వరల్డ్ ఫుడ్ ఇండియా' దక్షిణ ప్రాంతీయ సదస్సు జరగనుంది.

ఆహార రంగంలో సరికొత్త సాంకేతికత, ఎగుమతులు, పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అలాగే FICCI భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని ఉమ్మడిగా ఏర్పాటు చేస్తున్నాయి.

ఈ సదస్సులో దక్షిణ భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక నుంచి ప్రతినిధులు వస్తారు. పుదుచ్చేరి, లక్ష్ద్వీప్, అండమాన్ అండ్ నికోబార్ దీవులు కూడా పా...