భారతదేశం, జూలై 8 -- ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం ఉదయం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) ద్వారా వైఎస్సార్ను స్మరించుకున్నారు.
"ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాం. నిజమైన కారుణ్యం గల నాయకుడు ఆయన. రాష్ట్ర పురోగతికి, ప్రజల సంక్షేమానికి తన జీవితాన్ని అంకితం చేశారు. ప్రజలకు, ముఖ్యంగా రైతులు, బలహీన వర్గాల వారికి, అలాగే కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన అద్భుతమైన సేవలు ఎప్పటికీ స్ఫూర్తినిస్తాయి, నిత్యం గుర్తుండిపోతాయి" అని ఖర్గే పేర్కొన్నారు.
ఖర్గేతో పాటు, కాంగ్రెస్ పార్టీ అధికారిక 'ఎక్స్' హ్యాండిల్ కూడా వైఎ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.