భారతదేశం, మే 26 -- జ్యోతిష్యశాస్త్రంలో ప్రకృతికి, గ్రహాలకు విడదీయరాని సంబంధం ఉంది. సూర్యుడు రోహిణి నక్షత్రరాశిలోకి ప్రవేశించినప్పుడు భూమిపై ఉష్ణోగ్రత విపరీతంగా పెరుగుతుంది. ఈ కాలంలోని మొదటి తొమ్మిది రోజులను 'నౌతాపం' అని అంటారు. ఈ వేసవి సమయంలో చెట్లకు నీరు పోయడం, కొత్త మొక్కలను నాటడం చాలా శుభకార్యంగా పరిగణిస్తారు. జ్యోతిష్యం ప్రకారం నౌతాపంలో కొన్ని మొక్కలను నాటడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోయి, జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సు కలుగుతాయి. ఆ మొక్కలు ఏంటో చూద్దాం..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రావి చెట్టు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల నిలయం. నౌతాపంలోని వేసవి కాలంలో బహిరంగ ప్రదేశంలో లేదా ఆలయ ప్రాంగణంలో రావి చెట్టును నాటడం వల్ల పితృ దోషం పూర్తిగా తొలగిపోతుంది. అలాగే శని దృష్టితో బాధపడేవారు ఈ చెట్టును నాటి, శనివారం నాడు నువ్వుల దీపాన్ని వెలిగిస్తే సడేసతి...