భారతదేశం, ఏప్రిల్ 18 -- ప్రొద్దూటూరులో జరిగిన హృదయ విదారకమైన ఘటనలో నలుగురు మరణించారు, భర్త వదిలివేసి వేరే మహిళతో వెళ్లిపోవడం వల్ల కలిగిన మానసిక క్షోభను తట్టుకోలేక ఒక మహిళ, తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి, ఆ తర్వాత తానూ తాగింది. ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటనలో చాలా రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరికి నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

పోలీసుల కథనం ప్రకారం, భువనేశ్వరికి శివ వెంకట కృష్ణతో వివాహం జరిగింది. ఈ దంపతులు చాలా సంవత్సరాలుగా ప్రొద్దుటూరులోని ఈశ్వర్ రెడ్డి నగర్ ప్రాంతంలో నివసిస్తున్నారు. 14 ఏళ్లుగా వివాహ బంధంలో ఉన్న ఆ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే, దాదాపు ఒకటిన్నర సంవత్సరాల క్రితం వారి వైవాహిక జీవితం చెడిపోయింది.

శివ వెంకట కృష్ణ వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. చివరికి తన భార్యను, పిల్లలను వదిలేశాడని పోలీసులు తెలిపారు. అప...