భారతదేశం, ఫిబ్రవరి 8 -- హైదరాబాద్ ఐటీ కారిడార్‌లోని కీలక జంక్షన్లలో మూడు మల్టీ-లెవల్ ఫ్లైఓవర్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. రూ.800 కోట్లతో చేపట్టిన ఈ జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్ మే 2028 నాటికి ట్రాఫిక్ సిగ్నల్‌లను తొలగించి దీర్ఘకాలిక రద్దీని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐఎస్‌బీ సమీపంలోని ఐఐఐటీ జంక్షన్ వద్ద మూడు మల్టీ-లెవల్ ఫ్లైఓవర్ల కోసం భూమి తవ్వకం, పిల్లర్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

ఐఐఐటీ జంక్షన్, ఖాజాగూడ, విప్రో జంక్షన్ వద్ద మూడు ఫ్లైఓవర్లను కలిగి ఉన్న ఈ ప్రాజెక్ట్.. సైబరాబాద్ ఐటీ బెల్ట్ లోపల సిగ్నల్-ఫ్రీ కారిడార్‌ను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది. కొన్ని నెలల క్రితం మట్టి పరీక్షలు పూర్తయిన తర్వాత.. లోతైన తవ్వకం కోసం భారీ యంత్రాలను మోహరించారు. ఇప్పుడు ఐఐఐ...