భారతదేశం, మార్చి 5 -- తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థుల విషయంపై కొన్ని రోజులుగా సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే తాజాగా ఈ విషయంపై ఉత్కంఠ వీడింది. ఇప్పటికే అభిషేష్ సింఘ్విని ఒక సీటుకు కన్ఫామ్ చేశారు. కానీ రెండో సీటు ఎవరికి అని ఉత్కంఠ నడిచింది. సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడు అయిన వేం నరేందర్ రెడ్డి పేరును ఏఐసీసీ ఖరారు చేసింది. అనేక మంది ఈ పదవికి పోటీ ఉన్నప్పటికీ వేం నరేందర్ రెడ్డికి అవకాశం వచ్చింది. మార్చి 5వ తేదీన సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి నామినేషన్ వేస్తారు.

మొత్తం 16 పేర్లను పరిశీలించి పార్టీ హైకమాండ్ పరిశీలనకు పంపారు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి న్యూఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో పోటీదారులను ఖరారు చేయడానికి చర్చలు జరిపారు.

కాంగ్రెస్ అధిష్టానం నరేందర్ రెడ్డి...