విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం.. ఉక్కుద్రవం లీకై ఎనిమిది మంది మృతి.. పలువురి పరిస్థితి విషమం!
భారతదేశం, జూన్ 8 -- విశాఖ ఉక్కు కర్మాగారం (Vizag Steel Plant) లో సోమవారం అత్యంత ఘోరమైన ప్రమాదం సంభవించింది. ప్లాంట్లోని స్టీల్ మెల్టింగ్ షాప్-2 (SMS-2) విభాగంలో ఉన్న ఎస్టీసీ-3 (STC-3) హీట్ ఎఫ్జీ వద్ద భారీ మొత్తంలో ద్రవరూపంలో ఉన్న ఉక్కు (Hot Liquid Steel) లీకవడంతో ఈ విపత్తు చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
పరిశ్రమ వర్గాల నుంచి అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఎస్ఎంఎస్-2 విభాగంలో భారీ క్రేన్ సహాయంతో కరిగిన ఉక్కు ద్రవాన్ని పైకి లిఫ్ట్ చేస్తుండగా అకస్మాత్తుగా సాంకేతిక లోపం తలెత్తింది. ఈ క్రమంలో నియంత్రణ కోల్పోయిన ఉక్కుద్రవం ఒక్కసారిగా కిందకు లీకైంది. అధిక ఉష్ణోగ్రత ఉన్న ఉక్కు ద్రవం కింద పడటంతో ఆ ప్రాంతమంతా క్షణాల వ్యవధిలో మంటలు చెలరేగాయి. అక్కడ విధుల్లో ఉ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.