భారతదేశం, జూలై 4 -- విశాఖపట్నం నగర పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ఒక బృహత్తర ప్రణాళిక సిద్ధమవుతోంది. విశాఖను పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దడంతో పాటు, పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ ఒక సమగ్ర ఇంటిగ్రేటెడ్ ఎకో-టూరిజం డెవలప్‌మెంట్ ప్లాన్(Integrated Eco-Tourism Development Plan)ను విశాఖపట్నం ఎంపీ ఎం. శ్రీభరత్ ప్రతిపాదించారు. నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన కైలాసగిరి, ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ (జూ పార్క్), కంబాలకొండ వన్యప్రాణి అభయారణ్యాన్ని ఒకదానితో ఒకటి అనుసంధానిస్తూ ఈ భారీ ప్రాజెక్టును చేపట్టనున్నారు.

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాథమిక ప్రతిపాదనలపై విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఎంపీ శ్రీభరత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో వీఎంఆర్‌డీఏ మెట్రో...