భారతదేశం, ఆగస్టు 10 -- భూగర్భ జలాలు దారుణంగా పడిపోవడంతో విశాఖపట్నంలో తీవ్ర నీటి కొరత ఏర్పడింది. నగరంలోని పలు ప్రాంతాల ప్రజలు దైనందిన అవసరాల కోసం, చివరికి తాగునీటి కోసం కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అరిలోవ, యారాడ, మధురవాడ, భీమునిపట్నం వంటి ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంది. తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ) అత్యవసర చర్యలు చేపట్టింది. నీటి ట్యాంకర్ల ద్వారా సరఫరాను వేగవంతం చేసింది. మరోవైపు అపార్ట్‌మెంట్లు, బహుళ అంతస్తుల సముదాయాల నివాసితులు ప్రైవేట్ ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తోంది. ప్రైవేట్ నీటి కోసం నెలకు రూ. 6,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు.

ఇన్నేళ్లలో నగరంలో ఇటువంటి తీవ్రమైన న...