భారతదేశం, జనవరి 20 -- మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ అవసరం అని భావిస్తున్నారా అని సీబీఐని అడిగింది అత్యున్నత న్యాయస్థానం. దర్యాప్తులో భాగంగా ఎవరిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాలని అనుకుంటున్నారో చెప్పాలని స్పష్టం చేసింది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది.
వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తుపై ట్రయల్ కోర్టు తీర్పును వివేకా కుమార్తె సునీతా రెడ్డి సుప్రీం కోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై ఎంఎం సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేసింది. ఏయే అంశాల మీద తదుపరి విచారణ అవసరమో.. చెప్పాలని తెలిపింది.
సునీత తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా వాదనలను వినిపించారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారమే.. ట్రయల్ కోర్టుకు వెళ్లామని చెప్పారు. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.