భారతదేశం, జూన్ 15 -- వివిధ రంగాల్లో సంయుక్తంగా పనిచేసేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గూగుల్ నిర్ణయించాయి. సింగపూర్‌లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గూగుల్ ఆసియా-పసిఫిక్ రీజియన్ అధ్యక్షుడు కరణ్ బజ్వాతో సమావేశమయ్యారు. ఈ మేరకు జరిగిన చర్చల్లో ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ గవర్నెన్స్ రంగాల్లో గూగుల్ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలనే అభిప్రాయానికి ఇరువురు వచ్చారు.

అలాగే డిజిటల్ గవర్నెన్స్‌లో గూగుల్ భాగస్వామి కావాలని కరణ్ బజ్వాను ముఖ్యమంత్రి కోరారు. రెండు రోజుల సింగపూర్ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి వివిధ సంస్థల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించారు. ఇందులో భాగంగా గూగుల్ ఆసియా - పసిఫిక్ రీజియన్ అధ్యక్షుడితో జరిగిన సమావేశంలో వివిధ కీలక అంశాలు ప్రస్...