భారతదేశం, జూలై 12 -- వియత్నాం బోటు ప్రమాదంలో మరణించిన ఆంధ్రప్రదేశ్ పర్యాటకుల భౌతికకాయాలను స్వదేశానికి తీసుకువచ్చే ప్రక్రియ వేగవంతమైంది. ఈ ఘోర ప్రమాదంలో గాయపడిన పర్యాటకుడు గెల్లా కిషోర్ ప్రస్తుతం వియత్నాంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆయన ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతోందని న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడిన తెలుగు పర్యాటకులు ఆదివారం (జూలై 12, 2026) రాత్రికల్లా భారతదేశానికి చేరుకోనున్నారు. ఫు క్వాక్ ద్వీపంలో చిక్కుకుపోయిన పర్యాటకులందరూ ఇప్పటికే హనోయిలోని నోయి బాయి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరంతా స్థానిక సమయం ప్రకారం రాత్రి 7.05 గంటలకు వియత్నాం ఎయిర్‌లైన్స్ విమానంలో బయలుదేరి, భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో హైదరాబాద్ చేరుకుంటా...