భారతదేశం, మే 28 -- వచ్చే నెల నుంచి విమాన ప్రయాణం భారంగా మారడమే కాకుండా, విమానాల లభ్యత కూడా తగ్గనుంది. ఆకాశాన్నంటుతున్న ఇంధన ధరలు, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలోని ప్రముఖ విమానయాన సంస్థలైన ఎయిర్ ఇండియా, ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తమ దేశీయ సర్వీసుల్లో భారీగా కోత విధిస్తున్నాయి. జూన్ నెల నుంచే ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.

టాటా గ్రూపునకు చెందిన ఎయిర్ ఇండియా తన దేశీయ నెట్‌వర్క్‌లో ఏకంగా 22 శాతం విమానాలను తగ్గించుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే అంతర్జాతీయ రూట్లలో 27 శాతం సర్వీసులను తగ్గించిన ఈ సంస్థ, ఇప్పుడు దేశీయంగా కూడా విమానాల సంఖ్యను కుదించనుంది. ప్రస్తుతం ఎయిర్ ఇండియా వారానికి దాదాపు 3,600 దేశీయ విమానాలను నడుపుతోంది. నెట్‌వర్క్ రేషనలైజేషన్‌లో భాగంగా తాత్కాలికంగా ఈ సర్దుబాట్లు చేస్తున్నట్లు సంస్థ వర్గాలు వెల్లడించ...