భారతదేశం, ఏప్రిల్ 2 -- భారత ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) మార్కెట్లోకి వియత్నాంకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం 'విన్‌ఫాస్ట్' (VinFast) దూకుడుగా అడుగుపెడుతోంది. భారతీయ కుటుంబాలను, ట్రావెల్ ఆపరేటర్లను ఆకట్టుకునేలా సరికొత్త ఎలక్ట్రిక్ మల్టీ పర్పస్ వెహికల్ (MPV)ని కంపెనీ తీసుకువస్తోంది. సొంతంగా వాడుకునే వారి కోసం 'వీఎఫ్ ఎమ్‌పీవీ 7' (VF MPV 7) పేరుతోనూ, కమర్షియల్ ఫ్లీట్ ఆపరేటర్ల కోసం 'లిమో గ్రీన్' (Limo Green) పేరుతోనూ ఈ సరికొత్త కార్లను కంపెనీ ప్రదర్శించింది. ఈ ఎలక్ట్రిక్ కారు అధికారిక బుకింగ్స్‌ను కూడా సంస్థ ప్రారంభించింది. కేవలం రూ. 21,000 టోకెన్ అమౌంట్ చెల్లించి కస్టమర్లు తమ వాహనాన్ని రిజర్వ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 15న దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఈ ఎలక్ట్రిక్ ఎమ్‌పీవీని మార్కెట్లోకి లాంచ్ చేయడానికి సర్వం సిద్ధమైంది. ఆసక్తి గల కొనుగోలుదారులు కంపెనీ...