భారతదేశం, ఏప్రిల్ 9 -- ప్రపంచవ్యాప్తంగా పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ అలరించే డిస్నీ సంస్థలో ఇప్పుడు ఆందోళన నెలకొంది. ఈ ఏడాది మార్చిలో డిస్నీ పగ్గాలను కొత్త సీఈవోగా జోష్ డి'అమరో చేపట్టారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన మొదటి ప్రధాన నిర్ణయమే ఉద్యోగాల కోత కావడం గమనార్హం. వాస్తవానికి ఈ లేఆఫ్స్ ప్రణాళికలు ఆయన బాధ్యతలు చేపట్టకముందే మొదలైనట్లు తెలుస్తోంది. వ్యయ నియంత్రణలో భాగంగా రాబోయే కొద్ది వారాల్లోనే దాదాపు వెయ్యి మంది సిబ్బందిని ఇంటికి పంపేందుకు యాజమాన్యం రంగం సిద్ధం చేసింది.

వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం, ఈ తాజా లేఆఫ్స్ వల్ల డిస్నీలోని మొత్తం సిబ్బందిలో ఒక శాతం కంటే తక్కువ మందిపై ప్రభావం పడనుంది. 2025 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి డిస్నీలో సుమారు 2.31 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. తాజాగా తొలగించనున్న వారిలో అత్యధికులు మార్కెటింగ్ వ...