భారతదేశం, సెప్టెంబర్ 20 -- సమాజ పురోగతికి, సమగ్ర మార్పునకు విద్య అత్యంత శక్తివంతమైన సాధనమని, అటువంటి పవిత్రమైన విద్యా వ్యవస్థను ఎట్టిపరిస్థితుల్లోనూ రాజకీయాలకు దూరంగా ఉంచాలని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. కాకినాడ జిల్లాలో పర్యటించిన ఆయన.. ప్రముఖ ప్రవచనకర్త, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆకుండి లక్ష్మీ స్మారక గోశాల ప్రాంగణంలో నిర్వహించిన భారతీయం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థుల్లో నైతిక విలువలు, మానసిక స్థైర్యం, దేశభక్తి పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి విద్య, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి అంటే ఎంతో ప్రత్యేకమైన ఆసక్తి అని తెలిపారు. పాఠశాలల్లో నాణ్యతా ప్రమాణాలు పెంచడంపై ప్రభుత్వం ప్రత్యేక దృ...