భారతదేశం, మార్చి 19 -- పన్ను చెల్లింపులను సులభతరం చేసేందుకు సిటిజన్ ఇన్షియేటివ్‌లో భాగంగా నగరవ్యాప్తంగా సెలవు దినాల్లో కూడా పన్ను వసూలు చేసే నగదు కౌంటర్లు పనిచేస్తాయని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్(వీఎంసీ) కమిషనర్ హెచ్.ఎం. ధ్యానచంద్ర ప్రకటించారు. ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీలో 50 శాతం మాఫీని అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో ఈ చర్య మెుదలుపెట్టారు.

విజయవాడ నివాసితులు ఈ ప్రయోజనాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా, వీఎంసీ పనివేళలను పొడిగించడంతో పాటు, పలు ప్రదేశాలలో చెల్లింపు సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూసింది.

కమిషనర్ ప్రకారం, నగర పరిధిలోని కీలక కేంద్రాలలో అన్ని సెలవు దినాలలో ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు నగదు కౌంటర్లు పనిచేస్తాయి. వీటిలో చిట్టినగర్ కలరా ఆసుపత్రి, హెచ్‌బీ కాలనీ, వీఎంసీ ప్రధా...