భారతదేశం, ఆగస్టు 14 -- ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి, ఆధ్యాత్మిక భక్తులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. విజయవాడ - వారణాసి (కాశీ) మధ్య విమాన సర్వీసులను ప్రారంభించినట్లు ప్రకటించింది. విజయవాడ నుంచి వారణాసి, కోల్‌కతాకు రాకపోకలు సాగించే ఇండిగో సర్వీసును పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దిల్లీ నుంచి వర్చువల్‌‌గా ప్రారంభించారు. అమరావతి కనకదుర్గమ్మ దర్శనం నుంచి కాశీ విశ్వనాథుని దివ్య సన్నిధికి వెళ్లే భక్తులకు ఈ కొత్త సర్వీస్ ఎంతో ప్రయోజనకరంగా మారనుంది.

ఇప్పటివరకు వారణాసి వెళ్లాలనుకునే తెలుగు భక్తులు హైదరాబాద్ లేదా ఇతర నగరాల మీదుగా కనెక్టింగ్ విమానాల్లో వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు విజయవాడ విమానాశ్రయం నుంచి కాశీకి సర్వీసులు అందుబాటులోకి రావడంతో సమయం ఆదా అవ్వడమే కాకుండా, ప్రయాణం ఎంతో సులభతరం కానుంది. శ్రీ కనకదుర్గ అమ్మవారి ద...