Telangana,hyderabad, జూలై 31 -- కాళేశ్వరం ప్రాజెక్ట్ పై తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసిన విచారణ కమిషన్‌ తన తుది నివేదిక సమర్పించింది. ఇవాళ బీఆర్‌కే భవన్‌కి వచ్చిన కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ పీసీ ఘోష్‌.. షీల్డ్ కవర్‌లో రిపోర్ట్ ను అందజేశారు. రెండు డాక్యుమెంట్లను ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాహుల్ బొజ్జాకు సమర్పించారు.

తుది నివేదికపై రాహుల్ బొజ్జా మీడియాతో మాట్లాడారు. సీల్డ్ కవర్ లో నివేదిక అందిందని. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేస్తామని తెలిపారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుతుందని పేర్కొన్నారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....