భారతదేశం, ఆగస్టు 3 -- తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను అనుసంధానిస్తూ నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ హైవే (NH-365BG) ఖమ్మం-దేవరపల్లి రోడ్డు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేసింది. రెండు రాష్ట్రాల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించే ఈ సరికొత్త జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను ఆదివారం నుంచే అనధికారికంగా అనుమతించారు. వారం రోజుల్లో ఈ హైవేను అధికారికంగా ప్రారంభించనున్నారు.

ఖమ్మం జిల్లా తాళ్లంపాడు గ్రామం వద్ద ప్రారంభమయ్యే ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం, దాని అనుబంధ మౌలిక వసతులు ఏడాది క్రితమే పూర్తయినప్పటికీ ధంసలాపురం వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం ఆలస్యం కావడంతో ఇన్నాళ్లూ ప్రారంభం వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం ఆర్‌వోబీ పనులు పూర్తికావడంతో వాహనదారులు తాళ్లంపాడు నుంచే నేరుగా హైవేపైకి ప్రవేశించే వెసులుబాటు లభించింది.

ఈ 162.04 కిలోమీటర్ల పొడవైన...