వాతావరణ శాఖ నుంచి బిగ్ అప్డేట్.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు
భారతదేశం, మే 30 -- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు రాబోయే మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రాబోయే రోజుల్లో నైరుతి రుతుపవనాలు అరేబియా సముద్రం, బంగాళాఖాతం, లక్షద్వీప్ ప్రాంతంలోని కొన్ని భాగాలలోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. నైరుతి బంగాళాఖాతం, తమిళనాడు తీరంపై సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఒక స్థిరమైన ఉపరితల వాయు ప్రసరణ వ్యవస్థ విస్తరించి ఉండటం వల్ల, ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో రాబోయే మూడు రోజుల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాలలో ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం కూడా ఉంది. గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీయ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.