భారతదేశం, జూన్ 21 -- వర్షాకాలంలో స్కూళ్ల వద్ద ట్రాఫిక్ జామ్‌లకు చెక్ పెట్టేందుకు సైబరాబాద్ పోలీస్ శాఖ ఒక కీలక ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు నగరంలో పెండింగ్‌లో ఉన్న మున్సిపల్ పనులను వేగవంతం చేసేందుకు వారానికి ఒకరోజు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించేలా విద్యాసంస్థలను కోరాలని పోలీసులు భావిస్తున్నారు.

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం. రమేష్ త్వరలోనే పాఠశాలల యాజమాన్యాలతో సమావేశం కానున్నారు. జూలై, ఆగస్టు నెలల్లో వారానికి ఒకరోజు (ముఖ్యంగా బుధ లేదా గురువారాల్లో) ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని ఆయన కోరనున్నారు. ఈ ప్రతిపాదన అమలైతే, రెండు నెలల్లో విద్యార్థులు 8 రోజులు ఇంటి నుంచే క్లాసులకు హాజరవుతారు. 'దీనివల్ల రోడ్లపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గడమే కాకుండా, సైబరాబాద్ మున్సిపల్ అధికారులు పౌర పనులను సజావుగా పూర్తి చేయడానికి వీలవుతు...