భారతదేశం, ఆగస్టు 12 -- హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి ఎంతో పవిత్రత ఉంటుంది. శుక్రవారాల నాడు ఆ తల్లి అష్టలక్ష్మీ స్వరూపిణి అయిన వరలక్ష్మీదేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. అలా పూజిస్తే కుటుంబంలో సిరిసంపదలు వర్ధిల్లాలని, అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ వివాహిత మహిళలు ఈ నోమును ఆచరిస్తారు.

ఈ ఏడాది ఆగస్టు 21వ తేదీన వరలక్ష్మీ వ్రతం. కేవలం సాధారణ వ్రతంలా కాకుండా, ఈసారి ఎన్నో అరుదైన ఖగోళ సంయోగాలు ఈ పండుగ రోజున ఏర్పడుతుండటం విశేషం.

ఏ పండగైనా, వ్రతమైనా సరైన ముహూర్తంలో ఆచరిస్తేనే సంపూర్ణ ఫలితం దక్కుతుంది. వరలక్ష్మీ వ్రతం రోజున స్థిర లగ్నంలో అమ్మవారిని పూజించడం అత్యంత శ్రేయస్కరం. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో ప్రారంభించి, మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో పూజ ముగించడం మంచిది.

ముఖ్...