భారతదేశం, ఫిబ్రవరి 27 -- లిక్కర్ కేసులో కోర్టు తీర్పుతో ఊరట దక్కిన నేపథ్యంలో కవిత స్పందించారు. న్యాయవ్యవస్థపై తాను పెట్టుకున్న నమ్మకం నిలబడిందన్నారు. తాను కడిగిన ముత్యంలా బయటికి వస్తానని తెలంగాణ ప్రజలకు మొదట్నుంచి చెబుతూనే వచ్చానని. ఇవాళ అలాగే వచ్చానని వ్యాఖ్యానించారు.

ఇది కేవలం రాజకీయ కక్షతో పెట్టిన కేసు అని ఎన్నోసార్లు చెప్పానని కవిత గుర్తు చేశారు. ఇవాళ కోర్టు తీర్పుతో అదే నిజమైందన్నారు. "ఈ కేసుతో నేను, నా కుటుంబం కొన్ని నెలలపాటు క్షోభ అనుభవించాం. విపక్షాలను వేధించేందుకు దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారు. కోర్టు తీర్పు రాకుండానే నాపై కొందరు అనుచితంగా మాట్లాడారు. కష్ట సమయంలో అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు. మరింత ఉత్సాహంతో ప్రజలకు సేవ చేస్తాను" అని కవిత స్పష్టం చేశారు.

ఢిల్లీ లిక్కర్ కేసు తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర...