భారతదేశం, మార్చి 25 -- స్టాక్ మార్కెట్‌లో ఇప్పుడు లాభాలు రాకపోయినా పర్వాలేదు కానీ, ఉన్న డబ్బు పోగొట్టుకోకుండా 'సర్వైవ్' అవ్వడం ముఖ్యమని ట్రేడర్లకు సూచించారు జెరోధా (Zerodha) బాస్ నితిన్ కామత్. అంతర్జాతీయ మార్కెట్లు ప్రస్తుతం అత్యంత అస్థిరంగా ఉన్నాయని, కేవలం వార్తల ఆధారంగానే భారీ ఒడిదుడుకులు లోనవుతున్నాయని ఆయన విశ్లేషించారు. ఈ మేరకు ఆయన లింక్డ్‌ఇన్ (LinkedIn) వేదికగా ఇన్వెస్టర్లను అప్రమత్తం చేస్తూ ఒక పోస్ట్ పెట్టారు.

ప్రస్తుత మార్కెట్ పరిస్థితిపై కామత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "మనం విచిత్రమైన కాలంలో ఉన్నాం. ప్రపంచ ఆర్థిక మార్కెట్లన్నీ ఇప్పుడు ఒకే ఒక్క వ్యక్తి ఇష్టాఇష్టాల మీద ఆధారపడి నడుస్తున్నట్టు కనిపిస్తోంది. ఆ వ్యక్తి ఏ మూడ్‌లో నిద్రలేచి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే అంశమే మార్కెట్లను శాసిస్తోంది" అని ఆయన పేర్కొన్నారు. భౌగోళిక రాజకీ...