భారతదేశం, జూలై 8 -- రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ముఖ్యమైన సమాచారం అందించింది. మిర్యాలగూడ నుంచి కాచిగూడ వైపు ప్రయాణించే ప్యాసింజర్ రైలు సమయాల్లో మార్పులు జరిగాయి. మిర్యాలగూడ-కాచిగూడ (రైలు నంబర్ 67776)ప్యాసింజర్ కొత్త వేళలు జూలై 10, 2026 నుండి ప్రారంభమయ్యే ప్రయాణాలకు వర్తిస్తాయని అధికారులు వెల్లడించారు.

నిర్వహణ పరమైన కారణాల వల్ల కొన్ని రైళ్లను మల్కాజ్‌గిరి రూట్‌కు బదులుగా చర్లపల్లి - మౌలా అలీ - లల్లాగూడ - సీతాఫల్‌మండి మీదుగా మళ్లించడమే ఈ సమయాల మార్పునకు ప్రధాన కారణం. మిర్యాలగూడ - నాగిరెడ్డిపల్లి మధ్య ఉన్న మిగిలిన స్టేషన్లలో రైలు సమయాల్లో ఎలాంటి మార్పు ఉండదు.

మల్కాజ్‌గిరి నుంచి విద్యానగర్ మధ్య ఉన్న స్టేషన్లలో రైలు నిమిషాల వ్యవధి ముందే రానుంది. కాబట్టి ప్రయాణికులు ఈ కొత్త సమయ పట్టికను గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని అధికారు...