భారతదేశం, జూన్ 30 -- హైదరాబాద్ శిల్పాకళావేదికలో నిర్వహించిన సభలో రైతు భరోసా నిధుల పంపిణీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 30 నెలల కాలంలో అన్నదాతలు ఆత్మగౌరవంతో బతికేలా, వ్యవసాయాన్ని ఒక పండుగలా తీర్చిదిద్దేందుకు సంపూర్ణంగా కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో చేసిన వినాశనాన్ని సరిదిద్దుతూ, సంక్షేమం, వికాసం వైపు రాష్ట్రాన్ని నడిపిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం పంతులు, బెజవాడ గోపాల్ రెడ్డి, పాలమూరు బిడ్డ బూర్గుల రామకృష్ణారావు కాలం నుండి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు (దాదాపు 60 ఏళ్లలో) తెలంగాణ అప్పు కేవలం రూ.69 వేల కోట్లు మాత్రమేనని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.

'జూన్ 2, 2014న తెలంగాణ ...