భారతదేశం, మార్చి 29 -- వ్యవసాయంలో అత్యాధునిక పరికరాల వాడకం పెరుగుతోంది. దీంతో పనులు చకాచకా అవుతున్నాయి. పంటల్లో చీడపీడల నివారణకు పిచికారీ చేయడానికి డ్రోన్ల వినియోగం ఇటీవల ఎక్కువైంది. రోజంతా చేసే పనిని డ్రోన్లు కొన్ని గంటల్లో చేసేస్తాయి.

వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో రైతులకు డ్రోన్లు, సంబంధిత పరికరాలను రాయితీపై సరఫరా చేయడంతో పాటు, వాటి నిర్వహణలో శిక్షణ కూడా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. యూనిట్‌కు గరిష్టంగా రూ. 4 లక్షలకు లోబడి, 40 శాతం సబ్సిడీని అందిస్తామని అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రతీ యూనిట్‌కు రూ.4లక్షల సబ్సిడీ దొరుకుతుంది.

వ్యవసాయ కూలీల కొరతను పరిష్కరించడానికి, సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, రైతులకు ఖర్చులను తగ్గించడానికి ప్రభుత్వం 40 శాతం సబ్సిడీతో డ్రోన్‌లను, శిక్షణా సహాయాన్ని అందిస్తుంది. ఈ ప్రక్రియలో ...