భారతదేశం, సెప్టెంబర్ 11 -- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు రెండో రోజు మెుదలైంది. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సూపర్ సిక్స్ హామీలతో పాటు వివిధ సంక్షేమ పథకాల అమలు, క్షేత్రస్థాయి ఫలితాలపై సీఎం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్లకు, జిల్లా అధికారులకు పలు కీలక దిశానిర్దేశాలు చేశారు.

ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ లబ్ధి పారదర్శకంగా ఏ ఆటంకం లేకుండా ప్రజలకు అందాలన్నదే ప్రభుత్వ ప్రాథమిక ధ్యేయమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఏయే సంక్షేమ పథకాలను ఏయే తేదీల్లో అర్హులకు అందిస్తున్నామనే సమగ్ర వివరాలతో కూడిన 'సంక్షేమ క్యాలెండర్'ను తక్షణమే రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

కేవలం లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేసి వదిలేయకుండా ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయా...