భారతదేశం, జూలై 31 -- Telangana Ration Card eKYC Status : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కుటుంబాలకు ఊరటనిచ్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కొక్క నెలకు విడివిడిగా కాకుండా.. రాబోయే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబరు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి లబ్ధిదారులకు అందజేయనుంది. కేంద్రం నుంచి మార్గదర్శకాలు రావడంతో. ఆగస్టు 1వ తేదీ నుంచే ఈ మూడు నెలల బియ్యం పంపిణీ ప్రక్రియను ప్రారంభించేందుకు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.

రేషన్ పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట వేసి, పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం ఆహార భద్రత (రేషన్) కార్డుదారులకు ఈ-కేవైసీ (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) నమోదును తప్పనిసరి చేసింది. కొత్త నిబంధనల ప్రకారం.. ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తయిన లబ్ధిదారులకు మాత్రమే వచ్చే నెల(ఆగస్ట్ 2026) నుంచి ఉచిత రేషన...