భారతదేశం, జూన్ 24 -- తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులకు విద్యాశాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు జూన్ 25న (గురువారం) మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కానున్నాయి.

హైదరాబాద్‌లోని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు. ఫలితాలు వెల్లడైన వెంటనే విద్యార్థులు తమ మార్కుల మెమోలను ఆన్‌లైన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఈ ఏడాది జూన్ 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. రెగ్యులర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన వారితో పాటు, మార్కులు తక్కువగా వచ్చి స్కోర్ పెంచుకోవాలనుకున్న (ఇంప్రూవ్‌మెంట్) విద్యార్థులు కూడా ఈ పరీక్షలకు హాజరయ్యారు. విద్యార్థు...