భారతదేశం, ఏప్రిల్ 7 -- 16వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎస్ఐపీబీ) సమావేశం అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగింది. పరిశ్రమలు, విద్యుత్, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడి ప్రతిపాదనలపై ఎస్ఐపీబీ సమావేశంలో చర్చ జరిగింది.

ఈ సమావేశానికి మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, టీజీ భరత్, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, పి.నారాయణ, వాసంశెట్టి సుభాష్, బీసీ జనార్ధన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

రూ.39,436 కోట్ల విలువైన 31 ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులతో 1,11,278 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఎస్ఐపీబీ సమావేశంలో భాగంగా అమరావతి క్వాంటం వ్యాలీలో మూడు సంస్థల ఏర్పాటుకు రాష్ట్రస్థ...