భారతదేశం, మే 23 -- ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తూ, అక్రమ సంపాదనతో కోట్లు కూడబెట్టిన మరో పెద్ద అవినీతి తిమింగలం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలకు చిక్కింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ (అర్బన్ ల్యాండ్ సీలింగ్ విభాగం) మర్రి వంశీమోహన్‌పై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు.

శుక్రవారం తెల్లవారుజామునే రంగంలోకి దిగిన ఏసీబీ బృందాలు హైదరాబాద్ వనస్థలిపురంలోని ఆయన నివాసంతో పాటు మేడ్చల్ యూఎల్‌సీ కార్యాలయం, గుంటూరులోని ఆయన మామ ఇల్లు, బంధువులు, బినామీలకు చెందిన మొత్తం 11 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించాయి.

ఈ సోదాలలో వంశీమోహన్‌కు చెందిన భారీగా ఆస్తులను అధికారులు గుర్తించారు. ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువల ప్రకారం వీటి ఖరీదు రూ.6.22 కోట్లు (ఇందులో రూ.5.68 కోట్ల విలువైన స్థ...