భారతదేశం, మే 13 -- భారత ఆర్థిక వ్యవస్థకు మే 13, బుధవారం ఒక చీకటి రోజుగా నిలిచిపోయింది. ముడి చమురు ధరల పెరుగుదల, విదేశీ రుణాల చెల్లింపుల ఒత్తిడితో రూపాయి విలువ కనిష్ట స్థాయికి పడిపోయింది. ఉదయం ట్రేడింగ్‌లో 95.61 వద్ద కాస్త ఆశాజనకంగా ప్రారంభమైనప్పటికీ, క్రమంగా అమ్మకాల ఒత్తిడి పెరగడంతో 95.80 స్థాయికి చేరింది. ఒకే రోజులో దాదాపు 30 పైసలు క్షీణించడం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది.

అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై ప్రభావం చూపుతున్నాయి. ఫిబ్రవరి 28న ఈ సంక్షోభం మొదలైనప్పటి నుంచి బ్రెంట్ క్రూడ్ ధరలు ఏకంగా 50 శాతం పెరిగాయి. భారత్ తన చమురు అవసరాల కోసం అత్యధికంగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. చమురు ధరలు పెరిగిన ప్రతిసారీ మనం అంతర్జాతీయ మార్కెట్లో ఎక్కువ డాలర్లను చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల మన విదేశీ మారక ద...