భారతదేశం, జూలై 14 -- దేశీయ రియల్ ఎస్టేట్ రంగంలో అదానీ గ్రూప్ దూకుడు పెంచింది. మార్కెట్లో నెలకొన్న ఒడిదొడుకులను తట్టుకుని అదానీ ఫ్యామిలీ రియల్ ఎస్టేట్ సంపద పరంగా మొదటి స్థానానికి చేరుకుంది. హురున్ ఇండియా విడుదల చేసిన తాజా 2026 జాబితా ప్రకారం టాప్-3 స్థానాల్లో నిలిచిన కుబేరుల వివరాలు ఇలా ఉన్నాయి.

64 ఏళ్ల గౌతమ్ అదానీ నేతృత్వంలోని 'అదానీ ప్రాపర్టీస్' ప్రస్తుతం దేశంలోనే అత్యంత విలువైన అన్‌లిస్టెడ్ రియల్ ఎస్టేట్ సంస్థగా అవతరించింది. గత రెండేళ్లలో ఈ సంస్థ అత్యధికంగా రూ. 33,900 కోట్ల విలువను సృష్టించి 'టాప్ వాల్యూ క్రియేటర్'గా నిలిచింది. మరోవైపు మార్కెట్ కరెక్షన్ కారణంగా డీఎల్ఎఫ్ అధినేత రాజీవ్ సింగ్ సంపద తగ్గడంతో ఆయన ఒక స్థానాన్ని కోల్పోయి రెండో స్థానానికి పడిపోయారు.

హురున్ ఇండియా నివేదిక ప్రకారం, ఈ ఏడాది జాబితాలోని మొత్తం 151 కంపెనీల సంయుక్త వ...