భారతదేశం, జూలై 19 -- వేద జ్యోతిష్యశాస్త్రంలో నీడ గ్రహాలుగా పిలిచే రాహు, కేతువుల కదలికలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. సుమారు ప్రతి 18 నెలలకు ఒకసారి రాశి మారే ఈ గ్రహాలు. 2026 డిసెంబర్ 5న తమ స్థానాలను మార్చుకోనున్నాయి. రాహువు కుంభరాశిని విడిచిపెట్టి మకర రాశిలోకి, కేతువు సింహరాశిని విడిచిపెట్టి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. జ్యోతిష్య లెక్కల ప్రకారం, ఈ మహా సంచారానికి ముందు సమయం 5 రాశుల వారికి అపారమైన ధనలాభాన్ని, కొత్త అవకాశాలను తెచ్చిపెట్టబోతోంది.

జ్యోతిష్యశాస్త్రంలో రాహువును ఆశయం, ఆకస్మిక అవకాశాలు, సాంకేతికతకు కారకుడిగా భావిస్తే.. కేతువును ఆధ్యాత్మికత, అనుభవానికి కారకుడిగా చూస్తారు. ఈ రెండు గ్రహాల మార్పు మానవుల నిర్ణయాత్మక సామర్థ్యాన్ని, ఆర్థిక, కుటుంబ జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.

Published by HT Digital Content Services with permiss...