భారతదేశం, సెప్టెంబర్ 16 -- ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రెండో రోజు కలెక్టర్ల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా స్వచ్ఛాంధ్ర, అటవీ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలపైనా సమీక్ష నిర్వహించారు. సదస్సులో డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, సీఎస్, డీజీపీ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో స్వచ్ఛాంధ్రప్రదేశ్‌ను ఉద్యమంగా చేపట్టనున్నట్టుగా తెలిపారు. స్వచ్ఛ భారత్ కోసం ఏ జిల్లాలో పైలట్ ప్రాజెక్టు చేపట్టినా.. అది రాష్ట్రమంతా వర్తింపజేయాలన్నారు. జనవరి నుంచి వ్యర్థం అనేది కనిపించకూడదని ఆదేశించారు.

'ఎన్ఆర్‌ఈజీఎస్ కింద ఘన వ్యర్థాల షెడ్ల నిర్మాణం కోసం కేంద్రానికి లేఖ రాయాలి. గిరిజన, వెనకబడిన ప్రాంతాల్లో వెదురుతో చేసే ఉత్పత్తుల కోసం కార్యక్రమాన్ని రూపొందించాలి. వెదురు ...