భారతదేశం, జనవరి 5 -- తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య సంస్థలలో మౌలిక సదుపాయాలు, పరికరాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడానికి చర్యలను వేగవంతం చేసింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ శాసనసభకు తెలియజేశారు. రూ. 58 కోట్ల విలువైన 485 కొత్త వెంటిలేటర్లను కొనుగోలు చేస్తున్నామన్నారు. వాటిని ఫిబ్రవరి నెలాఖరులోగా వివిధ ఆసుపత్రులలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. జాతీయ వైద్య మండలి నిబంధనలకు అనుగుణంగా తృతీయ స్థాయి ఆసుపత్రులలో అవసరమైన పరికరాలను ప్రభుత్వం అంచనా వేసిందని, వాటిని కొనుగోలు చేసే ప్రక్రియ కొనసాగుతోందని అన్నారు.
ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు అంటే మార్చిలోపు ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆరు వేర్వేరు ఆసుపత్రులలో ఏర్పాటు చేయడానికి రూ. 192 కోట్ల వ్యయంతో ఎనిమిది కొత్త ఎంఆర్ఐ యంత్రాలను కొనుగోలు చేయడానికి చర్యలు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.