భారతదేశం, మే 20 -- రాష్ట్రంలో రైతులకు అందాల్సిన ఎరువులను అక్రమంగా పక్కదారి పట్టించడం, వ్యవసాయేతర అవసరాలకు వినియోగించడం, బ్లాక్ మార్కెట్, అక్రమ నిల్వలు, ఇతర ప్రాంతాలకు తరలింపు వంటి వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే ఎలాంటి చర్యలనైనా ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

రైతులకు సరైన సమయంలో నాణ్యమైన ఎరువులు అందకుండా కొరత సృష్టించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని మంత్రి అచ్చెన్న ఘాటుగా హెచ్చరించారు. ఎరువులను అక్రమంగా నిల్వ చేయడం, ఇతర రాష్ట్రాలకు తరలించడం, పరిశ్రమలకు మళ్లించడం, అధిక ధరలకు విక్రయించడం వంటి చర్యలకు పాల్పడే డీలర్లు, మధ్యవర్తులు, బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఎ...