భారతదేశం, జూన్ 22 -- నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటం, దానికి తోడు ద్రోణి ప్రభావం కొనసాగుతుండటంతో రాబోయే ఐదు రోజుల పాటు తెలంగాణవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులు పలు జిల్లాలకు ముందస్తు జాగ్రత్తలు జారీ చేశారు.

వాతావరణ శాఖ తాజా నివేదిక ప్రకారం, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం నాటికి వర్షాల తీవ్రత మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. కామారెడ్డి, మెదక్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ వాతావరణం వేగంగా మా...